
పేరడీ సూరీడు, సాహితీ చంద్రుడు జలసూత్రం రుక్మిణీ శాస్త్రి గారి అరుదైన ఫోటో ఇది. నిన్న పుస్తకాలు సర్దుతుంటే తొంగిచూసిన పుస్తకాన్ని బయటికి లాగితే..అది కాస్తా జరుక్ శాస్త్రి గారు రాసిన ' తనలో తాను ' స్వగతాల సంపుటి అయి కూచుంది. ఈ ఫోటో అందులోదే!అప్పుడు కూడా ఒరిజినల్ ఫోటో దొరకలేదన్న మాట!ఇహ టైము వేస్టెందుకని, ఇరవయ్యేళ్ల నాడు ఒక సాహితీ క్విజ్ లో (ఎనిమిదో క్లాసులో అనుకుంటా) నాకు బహుమతిగా లభించిన ఈ పుస్తకాన్ని మొత్తం పూర్తి చేసాను.
నవోదయ వాళ్ళు ఈ పుస్తకం వేసారు. ఇప్పుడెళ్ళి అడిగి చూడండి(బడిచౌడి ఆర్య సమాజ్ ఎదురు సందులో ఉంటుంది నవోదయ వారి షాపు), ' ఏమో తెలియదండీ ' అనే సమాధానం వస్తుంది.
జరుక్ శాస్త్రి కేవలం పేరడీ కారుడు మాత్రమే కాదు. గొప్ప సాహితీ కర్త కూడా! " అసాధారణమైన ఉపజ్ఞతో , అచ్చమైఅన ప్రతిభతో కవితలు రాశాడు,ఎవరికీ 'ఇమిటేషన్ ' అనిపైంచని కథలు రాశాడు! " అని 'తనలో తాను ' పీఠికలో శ్రీ కె. వి. రమణా రెడ్డి గారు రాశారు.
ఎవరైనా ఒక అయిడియా అందిస్తే, వెంటనే ఒడుపు గ్రహించి చక్కని రచన చేసే వారట ఆయన. ఒక సారి చక్రపాణి గారు బెంగాలీ పత్రికల్లోంచి ఒక చక్కటి ఐడియా చెప్పారు.
"గొప్ప వాళ్ళు ప్రతి చచ్చు వ్యాపారనికీ సిఫార్సులివ్వడం"
వెంటనే రుక్మిణీ నాధుల వారు, ఆ ఐడియాను దించి, ఒక కూరల అంగడి వాడికి విశ్వనాధ సత్యనారాయణ, తల్లావఝల శివశంకర శాస్త్రి, మరొకరు యోగ్యతా పత్రాలిచ్చినట్టు బ్రహ్మాండ మైన వ్యాసం రాశారట.
ఇంత ప్రతిభ కలిగిన వాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా రేడియో ఆర్టిస్టుగా మిగిలి పోయాడని కొడవటిగంటి కుటుంబ రావు బాధపడ్డారు. "రేడియో ఆర్టిస్టుగా అతను రచన వెనక ఉండే సహజమైన ప్రేరణలను ఎండగట్టుకున్నాడు." అని రాశారు కొ.కు.
పేరడీ సామాన్యమైన విద్య కాదు. అదీ గాక, అయనా ఎదో ఒక రచన పట్టుకుని దానికి పేరడీ రాయడం కాక, అసంఖ్యాక రచయితల సారాన్ని గ్రహించి, వారి శైలిలోనే ఏదైనా పేరడీ చేయగలిగారు.
ఆయన పేరడీలు ఇప్పుడు ఎక్కడా అందుబాటులో లేవు. చాలా వాటి విలువ పోగొట్టుకున్నాకే తెలుస్తుంది. నా లక్కు, ఎక్కడా లేని, దొరకని ఈ పుస్తకం నా దగ్గరుండటం! ఆయన చమత్కారాల్లో ఒకటి...!
మల్ల వరపు విశ్వేశ్వర రావు గారి మధుకీల కావ్యానికి ముందు మాటలో దేవుల పల్లి కృష్ణ శాస్త్రి ఇలా రాశారు.
"విశ్వేశ్వర రావూ!
నీ రచనలన్నీ పుస్తక రూపంలో రావాలయ్యా,
నువ్వు కవివయ్యా--
నేను ఎవ్వరితోటీ ఇట్లా అనను,
విశ్వేశ్వర్రావు నిజంగా కవి"
ఈ పంక్తులు చదివాక, మన రుక్కాయి చేసిన పేరడీ చూడండీ..
"సుబ్బారావూ,
నువ్వింక క్షవరం చేయించుకోవాలయ్యా!
నీ తల మాసిందయ్యా!
నేను ఎవ్వరితోటీ ఇట్లా అనను,
సుబ్బారావు నిజంగా తలకు మాసిన వాడు"
నవ్వని వాడెవరు చెప్పండి?
జలసూత్రం అనే ఇంటి పేరు తమాషాగా ఉందండీ అని ఎవరినా అంటే,'H2O ఫార్ములా మా పూర్వీకులే కనిపెట్టా రండీ, అని నమ్మకంగా చెప్పి నవ్వించే వార్ట!
అసమాన ప్రతిభతో ప్రముఖ కవులను వ్యంగ్యంగా అనుకరిస్తూ పేరడీలు చెపుతుంటే, ' మీరీ టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నారు ' అనడిగితే..
"మా నాన్న దగ్గర నేర్చుకున్నాను! మా నాన్న చూడండి, కృష్ణ శాస్త్రి పేరుని పేరడీ చేసి నాకు పేరు పెట్టాడు (కృష్ణ శాస్త్రి అన్నా, రుక్మిణీ నాధ శాస్త్రి అన్నా అర్థం ఒకటే కదా)" అనేవారట ఆయన.
నవోదయ వాళ్ళు ఈ పుస్తకం వేసారు. ఇప్పుడెళ్ళి అడిగి చూడండి(బడిచౌడి ఆర్య సమాజ్ ఎదురు సందులో ఉంటుంది నవోదయ వారి షాపు), ' ఏమో తెలియదండీ ' అనే సమాధానం వస్తుంది.
జరుక్ శాస్త్రి కేవలం పేరడీ కారుడు మాత్రమే కాదు. గొప్ప సాహితీ కర్త కూడా! " అసాధారణమైన ఉపజ్ఞతో , అచ్చమైఅన ప్రతిభతో కవితలు రాశాడు,ఎవరికీ 'ఇమిటేషన్ ' అనిపైంచని కథలు రాశాడు! " అని 'తనలో తాను ' పీఠికలో శ్రీ కె. వి. రమణా రెడ్డి గారు రాశారు.
ఎవరైనా ఒక అయిడియా అందిస్తే, వెంటనే ఒడుపు గ్రహించి చక్కని రచన చేసే వారట ఆయన. ఒక సారి చక్రపాణి గారు బెంగాలీ పత్రికల్లోంచి ఒక చక్కటి ఐడియా చెప్పారు.
"గొప్ప వాళ్ళు ప్రతి చచ్చు వ్యాపారనికీ సిఫార్సులివ్వడం"
వెంటనే రుక్మిణీ నాధుల వారు, ఆ ఐడియాను దించి, ఒక కూరల అంగడి వాడికి విశ్వనాధ సత్యనారాయణ, తల్లావఝల శివశంకర శాస్త్రి, మరొకరు యోగ్యతా పత్రాలిచ్చినట్టు బ్రహ్మాండ మైన వ్యాసం రాశారట.
ఇంత ప్రతిభ కలిగిన వాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా రేడియో ఆర్టిస్టుగా మిగిలి పోయాడని కొడవటిగంటి కుటుంబ రావు బాధపడ్డారు. "రేడియో ఆర్టిస్టుగా అతను రచన వెనక ఉండే సహజమైన ప్రేరణలను ఎండగట్టుకున్నాడు." అని రాశారు కొ.కు.
పేరడీ సామాన్యమైన విద్య కాదు. అదీ గాక, అయనా ఎదో ఒక రచన పట్టుకుని దానికి పేరడీ రాయడం కాక, అసంఖ్యాక రచయితల సారాన్ని గ్రహించి, వారి శైలిలోనే ఏదైనా పేరడీ చేయగలిగారు.
ఆయన పేరడీలు ఇప్పుడు ఎక్కడా అందుబాటులో లేవు. చాలా వాటి విలువ పోగొట్టుకున్నాకే తెలుస్తుంది. నా లక్కు, ఎక్కడా లేని, దొరకని ఈ పుస్తకం నా దగ్గరుండటం! ఆయన చమత్కారాల్లో ఒకటి...!
మల్ల వరపు విశ్వేశ్వర రావు గారి మధుకీల కావ్యానికి ముందు మాటలో దేవుల పల్లి కృష్ణ శాస్త్రి ఇలా రాశారు.
"విశ్వేశ్వర రావూ!
నీ రచనలన్నీ పుస్తక రూపంలో రావాలయ్యా,
నువ్వు కవివయ్యా--
నేను ఎవ్వరితోటీ ఇట్లా అనను,
విశ్వేశ్వర్రావు నిజంగా కవి"
ఈ పంక్తులు చదివాక, మన రుక్కాయి చేసిన పేరడీ చూడండీ..
"సుబ్బారావూ,
నువ్వింక క్షవరం చేయించుకోవాలయ్యా!
నీ తల మాసిందయ్యా!
నేను ఎవ్వరితోటీ ఇట్లా అనను,
సుబ్బారావు నిజంగా తలకు మాసిన వాడు"
నవ్వని వాడెవరు చెప్పండి?
జలసూత్రం అనే ఇంటి పేరు తమాషాగా ఉందండీ అని ఎవరినా అంటే,'H2O ఫార్ములా మా పూర్వీకులే కనిపెట్టా రండీ, అని నమ్మకంగా చెప్పి నవ్వించే వార్ట!
అసమాన ప్రతిభతో ప్రముఖ కవులను వ్యంగ్యంగా అనుకరిస్తూ పేరడీలు చెపుతుంటే, ' మీరీ టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నారు ' అనడిగితే..
"మా నాన్న దగ్గర నేర్చుకున్నాను! మా నాన్న చూడండి, కృష్ణ శాస్త్రి పేరుని పేరడీ చేసి నాకు పేరు పెట్టాడు (కృష్ణ శాస్త్రి అన్నా, రుక్మిణీ నాధ శాస్త్రి అన్నా అర్థం ఒకటే కదా)" అనేవారట ఆయన.
NOTE: ఇందులో వాడిన పేరడీలు శ్రీరమణ గారి సంకలనం 'హాస్య జ్యోతి ' నుండి(సం)గ్రహించాను. వారికి కృక్షతమాజ్ఞపతణలు.
